పాలస్టీనా గాజాపై యుద్ధం ఆపాలి

 

 

అశోక విజయదశమి స్పూర్తితో

*పాలస్తీనా గాజాపై యుద్ధం ఆపాలి* 

 

ఆధునిక ప్రపంచంలో మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల కన్న ఆతి క్రూరమైన యుద్ధం కళింగ యుద్ధం. ఆ యుద్ధం నుంచి సామ్రాట్ అశోక చక్రవర్తి “యుద్ధం వద్దు బౌద్ధం ముద్దు” అంటూ సంకల్పించాడు. దాని ఫలితం భారత ఆర్థిక వ్యవస్థ బలపడింది. వాణిజ్యం అభివృద్ధి చెందాయి, సంస్కృతి విద్య అభివృద్ధి చెందాయి, మానవులు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. ఇది కేవలం బుద్దుడి మానవీయ బోధనల పరిణామమే. తదనంతరం అశోకుడి వారసులైన మౌర్య వంశస్తుల కాలం నాటికి భారతదేశం “బంగారు పక్షి” (భారత్ సోనే కి చిడియా) గా విశ్వమంతట పేరుగాంచిన మహాఅద్భుత చరిత్రను మన పూర్వీకులు చూశారు. అందుకే పాలస్తీనా గాజా, లెబనాన్, పై జరగుతున్న క్రూరదాడిని యూఎన్ఓ తక్షణమే ఆపాలి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి, దేశ కేంద్ర ప్రభుత్వం కూడా అట్టి అమానవీయ మారణహోమం ఆపడానికి కృషి చేయాలి. సామ్రాట్ అశోకుడి మార్గంలో సకల విశ్వం ప్రయాణించాలాంటూ ధర్మ సమాజ్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షులు బోడ ఉమేష్ మహారాజ్ పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం జిల్లా నిజమాబాద్ మోర్తాడ్ మండల కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద పలు సంఘాలచే 2568వ అశోక విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో దళిత సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జాంభవా చమార్, మామిడి గంగాధర్, ఏఐఏయుఎస్ నాయకులు జర్నలిస్ట్ అంగుళి మాలజీ, మరోడి సురేష్, కొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now