Site icon PRASHNA AYUDHAM

అరుదైన ఆపరేషన్ల కి నెలవు గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి

IMG 20250627 WA0365

విరిగిన దవడకి శస్త్రచికిత్స చేసి అతికించిన వైద్యులు
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 27
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సుమారు ఇరవై రోజుల కిందట పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామo నుండి చైతన్య ప్రకాష్ అనే వ్యక్తి తాపి పనులు చేస్తూ మూడవ అంతస్తు నుండి జారీ కింద పడగా దవడ బొక్క చితికి విరిగిపోయింది.తీవ్ర ఇబ్బందులతో పాల్వంచ ఆసుపత్రి కి రాగా డా వంశీ కృష్ణ పరిశీలించి ఆపరేషన్ చేసి విరిగిన దవడ బొక్కను శస్త్రచికిత్స చేసి ప్లేట్స్ పెట్టి అతికించి భవిష్యత్తులో నమలడానికి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మంచి చికిత్స అందించారు.నేడు దవడకి పెట్టిన అర్చ్ బార్స్ తీసేసి పరీక్షించి ఇంటికి పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రి లో ఇంత మంచి చికిత్స చేసినందుకు చైతన్య పాల్వంచ వైద్యులకు,వైద్య సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపాడు. జిల్లాలో ఇటువంటి ఆపరేషన్ ప్రభుత్వ ఆసుపత్రి లో చేయడం అరుదు.సుమారు లక్ష రూపాయలు విలువైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి రోగిపై భారం పడకుండా ఇతర ప్రాంతాలకు పంపకుండా స్థానికంగానే చికిత్స చేసిన వైద్యుడు డా వంశీ కృష్ణ , ఆసుపత్రి సూపరింటెండెంట్ డా రామ్ ప్రసాద్ పాల్వంచ ఆసుపత్రి సిబ్బంది ని కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివ రావు,జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్, డీసి హెచ్ ఎస్ రవి బాబు అభినందించారు.

Exit mobile version