కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికుల పరేషాన్..
నడిరోడ్డులో ఆర్టిసి బస్సు దుకాణం..
సాంకేతిక కారణాలతో ఆగిన బస్సు.. రోడ్డున పడ్డ ప్రయాణికులు.
షాద్ నగర్ నుండి హైదరాబాద్ కు బయలుదేరిన బస్సుతో ప్రయాణికుల ఇక్కట్లు

కాలం చెల్లిన బస్సులతో షాద్ నగర్ బస్సులతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. వియప్రయాసలు గూర్చి సొంత పనులపై వెళ్తున్న ప్రజలు మార్గమధ్యలో బస్సు సాంకేతిక కారణాలతో చెడిపోయి రోడ్డున పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్సు ఆర్టీసి డిపోకు చెందిన ఆర్టిసి బస్సు టీఎస్ 06 జెడ్ 0166 ఉదయం 10 నిమిషాలకు 17 నిమిషాలకు హైదరాబాద్ కు ప్రయాణికులను స్థానికంగా ఎక్కించుకొని బయలుదేరింది. సరిగ్గా మదనపల్లి వద్ద బసుమరాయించింది. వివిధ పనులపై వెళ్తున్న ప్రయాణికులు బస్సు దిగిపోయారు. డిపో నుండి కొంతమంది మెకానికులు వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొంతమంది ప్రయాణికులు అప్పటికే ఆలస్యం అవుతుండడంతో అరగంట తర్వాత బస్సు మెకానిజం పూర్తి కాకపోవడంతో కొంతమంది ప్రయాణికులు ఇతర బస్సులను ఆశ్రయించారు. మరికొందరు గతింతల లేక అక్కడ నిలిచిపోయారు. కండక్టర్ ఇచ్చిన బస్సు టికెట్ పై టీఎస్ 29 జెడ్ 0020 నంబర్ రాసి ఉంది, కానీ ప్రయాణికులకు పంపించిన బస్సు మాత్రం మరొకటి ఉంది. టికెట్టు పై ఉన్న బస్సు ప్రయాణికులకు వెళ్లలేదు. టీఎస్ 06 జెడ్ 0166 మరో బస్సులు ప్రయాణికులకు పంపించారు. బస్సు మారడంపై కూడా ప్రయాణికులు సందేహం వ్యక్తం చేశారు. కండిషన్లో లేని బస్సులను ప్రయాణికులకు పంపించడం ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. షాద్ నగర్ డిపోలో బస్సుల నిర్వహణ సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురిస్తుందని ప్రయాణికులు లబోదిబొమన్నారు. ప్రయాణికులను అవస్థకు గురి చేయకుండా మంచి నిర్వహణ చేపట్టాలని కండిషన్లో ఉన్న బస్సులను మాత్రమే రూట్లల్లో నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.. *కేపి*