*ఘనంగా అరకు పార్లమెంటరీ మహానాడు..*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 22 ( కృష్ణ ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ చంద్ర ఆధ్వర్యంలో అరకు పార్లమెంటరీ మహానాడు సౌందర్య హాల్ వద్ద ఘనంగా జరిగింది. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ & గిరిజన సంక్షేమ శాఖ మంత్రి *గుమ్మడి* *సంధ్యారాణి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ & కురుపాం శాసనసభ్యులు *తోయక జగదీశ్వరి* రాష్ట్ర జిసిసి చైర్మన్, అరకు పార్లమెంట్ అధ్యక్షులు *కిడారి* *శ్రావణ్ కుమార్* పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కడపలో జరగబోయే మహానాడుకి అందరూ తప్పకుండా హాజరవ్వాల్సిందిగా కోరారు. ఈ మహానాడు కార్యక్రమానికి 7 నియోజకవర్గాలు పరిధిలోని నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ పరిశీలకులు హర్షవర్ధన్, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్.పి.భంజ్ దేవ్, రంపచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి, రాష్ట్ర కార్యదర్శులు ప్రసాద్, వీరేష్ చంద్ర దేవ్, పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ పడాల భూదేవి తదితరులు పాల్గొన్నారు.