రైతు భరోసా నిధుల విడుదలకు డిమాండ్ చేస్తూ పటాన్చెరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ధర్నా

*రైతు భరోసా నిధుల విడుదలకు డిమాండ్ చేస్తూ పటాన్చెరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ధర్నా*

రేపు ఉదయం 9:30 గంటలకు పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణం లో రైతులకు న్యాయం కోసం పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి , పటాన్చెరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి అనే డిమాండ్‌తో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

*ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి  తన్నీరు హరీష్ రావు ,జిల్లా ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్,కొత్త ప్రభాకర్ రెడ్డి,సునీత లక్ష్మ రెడ్డి , మాణిక్ రావు ,మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ ,భూపాల్ రెడ్డి  హాజరవుతారు.*

పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన రామచంద్రపురం, జిన్నారం, పటాన్చెరు, అమీన్పూర్ మండలాలలో సుమారు 42,302 ఎకరాల భూమి ఉన్న రైతులు “రైతు భరోసా” నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు 27,120 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడంతో, వేలాది మంది రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఈ ఆందోళనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment