Headlines :
-
కూకట్పల్లిలో ఉచిత వైద్య శిబిరం: పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రసంగం
-
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం: ఉచిత వైద్య శిబిరంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి
-
తెలంగాణ గౌడ సంఘం ప్రజా సేవ: ఉచిత వైద్య సేవలందించిన డాక్టర్లు
-
లైన్స్ క్లబ్ సహకారంతో కూకట్పల్లిలో వైద్య సేవలు
-
కోనుగోలు ఆరోగ్య పరీక్షలు: ఉచిత సేవలను అందించిన వైద్య శిబిరం
టెంపుల్ బస్ స్టాప్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన పట్నం సునీత మహేందర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 01: కూకట్పల్లి ప్రతినిధి
ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ కనబరచాలని రంగారెడ్డి జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ లో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు రోగాల నిర్ధారణకు పరీక్షలు చేయించుకోవాలని తద్వారా రోగాల నివారణకు చర్యలు గైకొన వచ్చన్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించిన తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు రాజేష్ గౌడ్ ను అభినందించారు.
సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ దోమలగూడ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి సహకార అందించారు. ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ మణిశంకర్ (క్రిటికల్ కేర్ కన్సల్టెంట్), డాక్టర్ సౌరబ్ చిల్లూరు (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ రాజారెడ్డి (ఇంటర్నల్ మెడిసిన్), డాక్టర్ జాహ్నవి(డైటీషన్), డాక్టర్ శ్రీనివాస్ (మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ-స్పోర్ట్స్ మెడిసిన్), డాక్టర్ అభిజీయాల్(కడియా లిస్ట్) బి, పీ, ఈసీజీ, షుగర్, కంటి, ఒబేసిటీ, గైనకాలజీ, జనరల్ ఫిజీషియన్, ఆర్తో, డైటీషియన్, న్యూరో, స్కిలిటన్, మజిల్, అసెస్మెంట్ తదితర పరీక్షలను ఉచితంగా చేశారు. కార్యక్రమంలో కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంజీవ రావు, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, కూన సత్యం గౌడ్, నజిరుద్దీన్, శ్రీధర్ ఆచారి, గిరి నాయుడు, అక్బర్, మణి గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేష్మ, స్వరూప గౌడ్, గౌడ సంఘం నాయకులు పి కిషోర్ గౌడ్, విజయకుమార్ గౌడ్, ప్రేమ్ కుమార్, గౌడ్, జి వినోద్ కుమార్ గౌడ్, శివరాం గౌడ్, రాజశేఖర్ గౌడ్, ఎస్ వెంకట్ గౌడ్, నితీష్ గౌడ్, మణికంఠ గౌడ్, పి సాగర్ గౌడ్, భీమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.