గుంతకల్ పట్టణానికి చెందిన అరవింద్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తోటి జనసైనికులు, నాయకులు ద్వారా తెలుసుకున్న వాసగిరి మణికంఠ తన వంతు బాధ్యతగా 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని జనసేన శ్రేణుల సమక్షంలో అందజేశారు…అనంతరం ఆయన అరవింద్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని మీ వెనకాల గుంతకల్ పట్టణంలోని యువత అంతా ఉందని, ఎంతో మంచివాడైనా యువకుడికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని, నిత్యం ఎంతో ఉత్సాహంగా ఉండే వ్యక్తికి ఇలా జరగడం మనసు కలిచివేసిందని, మా తరఫున ఇంకా చేతనైన సహాయం అందించడానికి కృషి చేస్తామని ముఖ్యంగా పట్టణంలోని మానవతావాదులు, సేవా తత్పరులు, దాతలు ముందుకొచ్చి ఎంతో భవిష్యత్తు ఉన్న ఇలాంటి యువకుడిని ఆదుకొని మానవత్వాన్ని చాటాలని వేడుకున్నారు…ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు కసాపురం నందా, గాజుల రాఘవేంద్ర, కథల వీధి అంజి మైనార్టీ నాయకుడు దాదు, లారెన్స్, బోయ శేఖర్, అల్లు రవి, ఆటో కృష్ణ, ప్రకాష్, సత్తి, ఆటో భాష తదితరులు పాల్గొన్నారు…
పవన్ కళ్యాణ్ సేవాస్ఫూర్తితో తన దాతృత్వాన్ని చాటుకున్న వాసగిరి మణికంఠ..
by admin admin
Published On: August 10, 2024 11:22 pm