స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలి  – పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

స్థానిక ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలి

– పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

– ప్రశ్న ఆయుధం కామారెడ్డి

నిజామాబాద్ పట్టణంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆదివారం వెళ్తూ కామారెడ్డి పట్టణంలోని షబ్బీర్ అలీ నివాసంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో అల్పాహార విందులో పాల్గొని మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోసం పార్టీ బలోపేతం గురించి దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చము ఇచ్చి శాలువాతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment