Site icon PRASHNA AYUDHAM

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి

గ్రామపంచాయతీ
Headlines in Telugu
  1. గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కొప్పుల శంకర్ డిమాండ్
  2. జమ్మికుంట మండలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేతనాల జాప్యం
  3. పండ్ల ధరల పెరుగుదల దృష్ట్యా కనీస వేతనం పెంపు డిమాండ్
  4. గ్రామపంచాయతీ కార్మికుల ప్రయోజనాల కోసం 26న జరిగే సదస్సుకు పిలుపు
  5. కొప్పుల శంకర్: ‘ప్రభుత్వం జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం చూపుతోంది’

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్

జమ్మికుంట నవంబర్ 20 ప్రశ్న ఆయుధం*

 గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, కొప్పుల శంకర్ అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున మాచన పెల్లి గ్రామంలోకార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ జమ్మికుంట మండలంలో జిల్లా వ్యాప్తంగా కూడా,గ్రామపంచాయతీ కార్మికులతో పని చేయించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ,కార్మికులకు వేతనాలు చెల్లించడంలో అధికారులకు లేదని,ప్రభుత్వ ఒకపక్క నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, వాటిని ఇతరరాత్ర ఖర్చులకు మరలించి, మండల స్థాయిలోని అధికారులు కార్యదర్శులు కార్మికులకు వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉదాహరణకి మాచనపెల్లి గ్రామంలో ఆరుగురు ఎంపీడబ్ల్యు వర్కర్స్ ఉంటే నలుగురి కార్మికులకు వేతనం రెగ్యులర్గా చెల్లించి, ఇద్దరు కార్మికులకు గత మూడు నెలల నుండి వేతనం బకాయి పెట్టడం వెనుక, స్థానిక కార్యదర్శి నిర్లక్ష్యం కనబడుతుందని కొప్పుల శంకర్ ఆరోపించారు ఓకే మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉంటే కొన్ని గ్రామాలలో రెగ్యులర్గా జీతం చెల్లిస్తూ కొన్ని గ్రామాలలో నిధులు లేవు డబ్బులు లేవు అంటూ గత మూడు నెలలుగా విలాసాగర్ గ్రామంలో కార్మికుల వేతనాలు చెల్లించడం లేదని

ఒకపక్క ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఒకటవ తేదీ నుండి పదవ తేదీలో వేతనాలు చెల్లించాలని చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని, అదేవిధంగా గ్రామపంచాయతీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా, కనీస వేతనం 26 వేల రూపాయలు పెంచాలని, జీవో నెంబర్ 51ని సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, కరోబార్ బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాస్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, తదితర డిమాండ్ల సాధన కోసం, ఈనెల 26న హైదరాబాద్లో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పుట్ల శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తిరుపతి, ఐలయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version