దోమకొండ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర పెన్షన్ దారుల అవస్థ

దోమకొండ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర పెన్షన్ దారుల అవస్థ

 

కామారెడ్డి జిల్లా దోమకొండ

(ప్రశ్న ఆయుధం) జూన్ 30

 

పింఛన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లింపులు జరపాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్

– కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వినతి పత్రం అందజేసత

– దోమకొండ మండల కేంద్రంలో 3270 పెన్షన్లు పోస్ట్ ఆఫీస్ దుబ్బ బంగ్లా నందు ఇద్దరు సిబ్బంది మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని అందువలన పింఛన్దారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వృద్ధులకు, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ను దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. మండలంలో మొత్తం 7291 ఆసరా పెన్షన్లు ప్రతి నెల అందజేస్తున్నారని, దోమకొండ గ్రామంలోనే 3270 పింఛన్లు ఉన్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. గ్రామంలో చివరగా ఉన్నటువంటి సుభాష్, మార్కండేయ, ఊరడమ్మ కాలనీలకు చెందిన వృద్ధులు వికలాంగులు ప్రతినెల పింఛన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దోమకొండ మండలంలో మొత్తం 7291 పెన్షన్లను బ్యాంక్ అకౌంట్ నందు జమ చేసే విధంగా చర్యలు తీసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దోమకొండ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment