*అంగరంగ వైభవంగా పెద్దమ్మతల్లి బోనాలు*
*జమ్మికుంట/ ఇల్లందకుంట జూన్ 20 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు సీతంపేట గ్రామాల ప్రజలను చల్లంగా చూడు తల్లి అని ముదిరాజ్ కులస్తులు అంగరంగ వైభవంగా పెద్దమ్మతల్లికి బోనాలను సమర్పించారు.ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవాలలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు సీతంపేట గ్రామాలకు చెందిన ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మతల్లి బోనాల జాతరను కనుల పండుగ నిర్వహించారు ప్రతి ఇంటి నుండి పెద్దమ్మ తల్లి బోనాలను తీసుకొని వచ్చి పెద్ద మొత్తంలో మహిళలు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ గ్రామపురవీధుల గుండా ఊరేగింపు వచ్చి పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే బూజునూరు ,సీతంపేట గ్రామలా ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు శుక్రవారం రోజున సమర్పించడం జరిగిందని గత సంవత్సరం 20 లక్షల రూపాయలతో పెద్దమ్మతల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ఆ పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలు సీతంపేట, బూజునూరు గ్రామాల ప్రజలపై ఉండి సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండుకుండలా ఉండి మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు లాభ కలగాలని గ్రామంలోని పాడిపంట గోడ్డుగోదా చల్లగా ఉండి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో బూజునూరు, సీతంపేట, గ్రామము ముదిరాజ్ కులస్తుల తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు