క్యాన్సర్ వ్యాధికి కారణమైన పురుగుల మందుల కంపెనీని ముసివేయాలి,  

క్యాన్సర్ వ్యాధికి కారణమైన పురుగుల మందుల కంపెనీని ముసివేయాలి,

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 20( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు

సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్!

క్యాన్సర్ వ్యాదికి కారణమైన గంగురేగువలస వద్ద ఉన్న స్టార్ ఆగ్రో కెమికల్ కంపెనీని వెంటనే మూసివేయాలని సిపిఐ, రైతు సంఘం నాయుకులు డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు లు ఆధ్వర్యంలో స్థానిక రైతులతో పురుగుల మందుల కంపెనీ ముందు ధర్నా చేయడం జరిగింది,

ఈ సందర్బంగా మాట్లాడుతూ,,

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగ రేగు వలస పంచాయతీలో వైద్య సిబ్బంది వెంటనే క్యాన్సర్ వ్యాధి కి కారణాలు తెలుసుకొని వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధానముగా డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ,

రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ పరుగులు మందుల

కంపెనీ పక్కన ఉన్న చెరువును పరిశీలించారు. జoఝావతి ప్రాజెక్ట్ కు వర్కుషాప్ షెడ్డు లో అక్రమంగా పురుగులు మందుల కంపెనీ కి సంబందించి మెటీరియల్ నిల్వ చేయడాన్ని పార్టీ నాయకత్వానికి రైతులు చూపించడం జరిగింది,,,పంచాయతీలో అత్యధికంగా 12 మంది వరకు క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన చాలా బాధాకరమన్నారు. మరో పదిమందికి పైగా క్యాన్సర్ వ్యాధితో రోగులు ఉండడం పరిస్థితి చాలా విసరచిందన్నారు. ముఖ్యంగా ఒక పంచాయతీ రెండు గ్రామాల్లో ఇంత మంది క్యాన్సర్ బారిన ఎందుకు పడుతున్నారో ఇప్పటికీ అర్థం కాక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు మృతి చెందిన కుటుంబాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారు ఇప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు చేసినప్పటికీ వారి కుటుంబాల ఆర్థికంగా చిదిగిపోయాయి అన్నారు. లక్షలు ఖర్చుపెట్టినప్పటికీ ప్రాణం దక్కకపోవడంతో కుటుంబాల ఆర్థికంగా చిదిగిపోయి కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. మిగిలిన అనేకమంది క్యాన్సర్ప బారిన పడి చికిత్స కోసం అప్పులు చేసుకొని ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడడం చాలా దారుణం అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించినప్పుడు వారి కుటుంబ పరిస్థితి చూసి చాలా బాధేసింది అన్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కలు మాత్రం కేవలం మూడే క్యాన్సర్ రోగులు ఉన్నారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. మరిచర్ల మహాలక్ష్మి, గుడ్ల హేమలత, జి. ఉమామహేశ్వరరావు, బి అనిల్ తదితరులు క్యాన్సర్ వ్యాధితో బాధపడడ వారి కుటుంబాల్లో వారిని ఆర్థికంగా

చిదిమేస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేషెంట్లు లేరని చెబుతూ కాలియా పని చేసి ఉన్న రోగులు పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. పంచాయతీలో ఇంత మందికి క్యాన్సర్ వ్యాప్తికి గల కారణాలను ప్రభుత్వం ఇప్పటికి కనీసం గుర్తించకపోవడం చాలా దారుణం అన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పురుగులు మందు కంపెనీ తయారు చేస్తున్న పురుగులు మందులు తయ్యారు చేస్తున్నారని ఆ తయారు సమయంలో వెలువడే వ్యర్ధాలు పక్కనే ఉన్న చెరువులో కలుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

పురుగులు మందు తయారు చేసే కంపెనీలో తయారుచేసిన ఆ మందులను పరిసర ప్రాంత రైతులు వాడడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని బయట కుటుంబాలు నుంచి అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు సరైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. క్యాన్సర్ వ్యాధికి గల కారణాలను ప్రభుత్వం తెలుసుకొని ఆ వ్యాధి నిర్మూలలు చేసి ఈ పంచాయతీని క్యాన్సర్ భారీ నుండి కాపాడాలని కోరారు. అనంతరం స్థానిక ఎంపీటీసీ సభ్యులు గంట వెంకట్ నాయుడు మాట్లాడుతూ,,, గ్రామాల్లో క్యాన్సర్ వ్యాధికి పురుగులు మందు కంపెనీ కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలోనే నలుగురు క్యాన్సర్ బాధితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగులు మందు ఫ్యాక్టరీ వద్ద కొలుషితలను గతం నుండి పక్కనే ఉన్న చెరువులో పడి వేయడం ఆ చెరువు నీరు ద్వారా వ్యవసాయం సాగుకు ఉపయోగించి వ్యాధులు బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీసం వార్తలు వచ్చినప్పటికీ ఏ ఒక్క అధికారి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా నామమాత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోయారు తప్ప ఇంతవరకు చర్యలు చేపట్టలదని అన్నారు. అధికారులు స్పందించి క్యాన్సర్ వ్యాధి నిర్మాణం చర్యలు చేపట్టి బాధితులకు సరైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లు శంకరరావు, మరిసర్ల సింహాచలం నాయుడు, మరిసర్ల సత్యనారాయణ, శెట్టి శ్రీరామ్, దొంకాడ హరి, కందుల దూలపాటి సాయి తదితర రైతులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment