తెలంగాణలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: తెలంగాణలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశాడు. లాటరీలో షాపు దక్కకపోతే రూ.3 లక్షలు అబ్కారీ శాఖకే వెళ్తాయని.. డబ్బును తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశాడు. లిక్కర్ పాలసీపై జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరాడు. దీనిపై ఆబ్కారీశాఖ కమిషనర్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.