రేపటి నుండి ఫిజికల్ టెస్ట్ పరీక్షలు..

రేపటి నుండి ఫిజికల్ టెస్ట్ పరీక్షలు..

IMG 20241013 WA0041

కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకోనుంది. ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్,సీఏపీఎఫ్‌,లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఇప్పటికే ఆన్‌లైన్‌ రాత పరీక్ష పూర్తి కాగా దేహ దారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పీఈటీ, పీఎస్‌టీ నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన కేంద్రాల్లో పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) అక్టోబర్‌ 14 నుంచి నవంబర్‌ 11 వరకు జరగనున్నాయి. 

 

ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రే షన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకో వచ్చు.

 

ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన సీఏపీఎఫ్‌,బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలోనూ 4,187 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ చేయ నున్నారు. శారీరక దారుఢ్య పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లు పూర్తైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి.. రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..

Join WhatsApp

Join Now