ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోచారం కాసుల
ప్రశ్న ఆయుధం 23 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ… ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పండగ రంజాన్ అనీ ఆయన తెలిపారు.ఈ మాసంలో ముస్లిం సోదరులు భక్తి ప్రవత్తులు ఏకాగ్రత ఆత్మను క్రమ పద్ధతిలో ఉంచుకొని క్రమశిక్షణతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్నారు అనీ అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.