నిషేధిత చైనా మాంజాను అమ్మితే చర్యలు తప్పవు..- పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ

నిషేధిత చైనా మాంజాను అమ్మితే చర్యలు తప్పవు..

– వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం

– మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం

– పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ

*సిద్దిపేట జిల్లా ప్రతినిధి, జనవరి 4, ( ప్రశ్న ఆయుధం ):*

ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను జిల్లాలో ఎక్కడైనా క్రయవిక్రయాలు జరిగినా.. వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ డాక్టర్ అనురాధ హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. చైనా మాంజాతో తలెత్తే అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని అన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు. ఈ యొక్క చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని, డయల్ 100 కిగాని ఫోన్ చేసి సమాచారం అందించాలని సీపీ సూచించారు.

Join WhatsApp

Join Now