*నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి,*
ప్రశ్నఆయుధం న్యూస్ 30 డిసెంబర్ కామారెడ్డి జిల్లా గాంధారి
*ప్రజల జీవితానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు..!*
*పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.*
.ప్రజలు,యువత డిసెంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, జరగకుండా జరుపుకోవాలని ఎస్ఐ బి. ఆంజనేయులు తెలిపారు. డిసెంబర్ 31వ తేది సాయంత్రం నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని, డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైడోవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలి. వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలని అన్నారు, వైన్ షాప్స్ మరియు బార్స్, రెస్టారెంట్స్ ప్రభుత్వ అనుమతించిన సమయపాలన మాత్రమే పాటించాలని అన్నారు.
స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాం, మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తామన్నారు. అదేవిదంగా వాహనము సీజ్ చేయడం లైసెన్స్ రద్దు చేయడం, బైండోవర్ లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడు తయాన్నారు. గంజాయ్, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాలు సేవించే వారి పై ఎప్పటికప్పుడు డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సైలెన్సర్ సౌండ్, ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు. మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తో సిట్టింగులు, ఆరుబయట మధ్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ, ఇబ్బందులను పెట్టే వారిపై షి టీం బృందాలు ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందని డిజేలు, సౌండ్ బాక్స్ ఉపయోగించడం, బాణసంచాలు పేల్చడం నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు. ముఖ్యంగా యువత పై కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర దేశాలకు వెళ్ళుటకు ఇవ్వబడవు, కావున యువత గమనించగలరు. మద్యానికి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికేట్స్, మల్టీ టీమ్స్, ముఖ్యమైన కూడలిలలో సిసి కెమరాలు ఏర్పాటు లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పై సూచనలు పాటిస్తూ మండల ప్రజలు, యువత యొక్క అమూల్యమైన జీవితం ప్రమాదాల బారిన పడకుండా చూడడం పోలీస్ వారి బాధ్యత..!ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.