Site icon PRASHNA AYUDHAM

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

IMG 20250124 WA0077

ములకలపల్లి (ప్రశ్నఆయుధం) ములకలపల్లి మండలం చాపరాల పల్లి గ్రామ ఫారెస్ట్ ఏరియాను ఎంచుకొని పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాట రాయుళ్లపై ములకలపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. పేకాట స్థావర సంఘటన స్థలంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు సంఘటన ప్రదేశంలో నుండి 5 మోటర్ ద్విచక్ర వాహనాలను,6000 రూపాయల నగదును, 4 ఆండ్రాయిడ్ మొబైల్ లను, 1 కీప్యాడ్ ఫోన్ మొత్తం 5 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలం నుంచి పారిపోయిన నలుగురు వ్యక్తుల పేర్లు తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్ తో పాటు కానిస్టేబుల్ తిరుపతిరావు, రవికుమార్, రమణ, చిన్ని, భాస్కర్ మరియు తేజ తదితరులు పాల్గొన్నారు. సహకరించిన పోలీస్ సిబ్బందిని ఎస్సై అభినందించారు.

Exit mobile version