జిమ్ లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు మంచిర్యాల పట్టణంలోని ప్రముఖ మూడు జిమ్ లను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ బన్సిలాలు మాట్లాడుతూ, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేయడమే కాకుండా సంబంధిత జిమ్ లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.