CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో మంత్రి నారా లోకేష్‌కు వేడుకోలు.

*దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో మంత్రి నారా లోకేష్‌కు వేడుకోలు.*

పల్నాడు జిల్లా… మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు.

రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది. దీంతో మరోసారి తన భూమిని విక్రయించుకునేందుకు అక్కడ నుండే ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు మరోసారి అడ్డుపడ్డారు. దీంతో ఆవేదనకు లోనయిన రాందాస్ తన బాధను వ్యక్తం చేస్తూ సెల్పీ వీడియో విడుదల చేశాడు.

మంత్రి నారా లోకేష్ తమ సమస్యను పరిష్కరించాలని వీడియోలో వేడుకున్నాడు. అప్పుల భారంతో పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిని విక్రయించుకోవాలనుకున్నా సాధ్యం కావడం లేదని, స్థానిక రాజకీయ నాయకులు జోక్యం

Join WhatsApp

Join Now

Leave a Comment