ఇటీవల లగచర్లలో ఫార్మా పరిశ్రమ కు సంబంధించి , రాజకీయాలు తగదని అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రైతులను పావులుగా చేసుకొని సమస్యను జఠినం చేయడం మంచిది కాదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బానోతు బద్రు నాయక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు . అధికార ప్రతిపక్ష పార్టీలు ఫార్మా అంశం ను ఘర్షణాత్మక రూపంలో తీసుకొని పోవడం ఎవరికి మంచిది కాదని , ఈ విషయంలో రైతులు బలి పశువులుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు . అధికారులపై దాడి పాల్పడటం ఏ మాత్రం సమంజసం కాదని , పార్టీలు కూడా ఈ విషయాన్ని మరింత విషమ సమస్యగా మారే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు . అఖిలపక్ష పార్టీలు , రైతులు , ప్రజాసంఘాల బాధ్యులు , స్థానిక ప్రజా ప్రతినిధులు ఇలా అందరి ఏకాభిప్రాయం తో ఫార్మా పై ఒక నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు . ఇటీవల కాలంలో ప్రతి చిన్న అంశంలో రాజకీయాలు చేయడం సాధారణంగా మారిందని ఇలాంటి వైఖరి విడనాడాలని సూచించారు . ఇప్పటికైనా సమస్యను రాజకీయం చేయడం గాని , మరిన్ని దాడులకు అవకాశం కల్పించడం సరి కాదన్నారు . ప్రజాస్వామ్య , ప్రజా ప్రభుత్వం తమదని కాంగ్రెస్ నాయకులు మంత్రులు మాటలు చెప్పకుండా చేతల్లో చూపిస్తే మంచిదని అన్నారు . అదేవిధంగా గ్రామంలో పౌర సేవలకు అంతరాయం కలిగించడం భయాందోళన కలిగించడం క్షమించరాని విషయం అన్నారు . సమస్యను త్వరగా పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సానుకూల వైఖరితో చర్చలు చేయాలని కోరారు .
Latest News
