పాలీ సెట్ విద్యార్థులకు అభినంద పత్రం అందజేత
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో పాలి సెట్ విద్యార్థులకు అభినంద పత్రం అందజేసినట్లు జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతితులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు భాను, కామారెడ్డి ఇంచార్జ్ అనిరుద్ లు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో మృతి చెందిన జవాన్లను స్మరించుకుంటూ వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని 5 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాను మాట్లాడుతూ పాలీసెట్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థులు ఈ పాలి సెట్ కోచింగ్ ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులను అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్, రాజు, మోహన్, రాజేందర్, నితిన్ కార్యకర్తలు పాల్గొన్నారు.