Site icon PRASHNA AYUDHAM

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

IMG 20250620 WA0268

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వారావుపేట (ఆర్ సి)
రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి. రాహుల్, పీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, పలు శాఖల ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు సీసీ రోడ్లు హైలెవెల్ వంతెనలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా సీతాయిగూడెం వెంగళరావు ప్రాజెక్ట్ వద్ద జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Exit mobile version