*హైకోర్టును ఆశ్రయించిన పోసాని*
ఏపీలో టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ ఆదోనిలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మతం, జాతి, నివాసం, భాషా ఆధారంగా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయనందుకు తనపై BNS సెక్షన్ 196(1) కింద నమోదు చేసిన కేసు చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు. 41A కింద నోటీసుల ఇచ్చి విచారణకు మాత్రమే తీసుకోవాలన్నారు.