అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (ఏఐయుకెఎస్)
జనవరి.2-1-2025 ములకలపల్లి(ప్రశ్నఆయుధం) భద్రాద్రికొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయం ముందు రైతాంగ సమస్యలపై అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది
ఈ సందర్భంగా *అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిషోర్*
మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు. నూపా భాస్కర్ లు మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన ఆర్థిక చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై కాల్పులు జరిపి, లాఠీ చార్జి చేసి, అరెస్టు చేసి జైల్లో పెట్టడం దుర్మార్గమని అన్నారు.
నోడా జైల్లో ఉన్న రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రాయబారపు వెంకటేశ్వర్లు, పార్టీ పాల్వంచ మండల కార్యదర్శి పూనెం రమేష్ పాల్గొన్నారు.