Site icon PRASHNA AYUDHAM

మాలమహానాడు అధ్యక్షులు పూల రవీందర్ ఆధ్వర్యంలో మాలల సింహగర్జన పోస్టర్

IMG 20241124 WA02831

జూలూరుపాడు మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాలమహానాడు అధ్యక్షులు పూల.రవీందర్ ఆధ్వర్యంలో మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన మాలల సింహగర్జన జిల్లా సమన్వయకర్తలు గోపోజి. రమేష్ పళ్ళ రాజశేఖర్ ఈరోజు జూలూరుపాడు మండలంలోని ఎల్లంకి కన్వెన్షన్ లో మాలల సింహ గర్జన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మాలల సింహ గర్జన జిల్లా సమన్వయకర్తలు గోపోజి రమేష్ మరియు పళ్ళ రాజశేఖర్ లు మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలోని ప్రతి ఒక్క మాల కుటుంబం డిసెంబర్ ఒకటవ తారీఖున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాలల సింహ గర్జన మహా సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర జిల్లా మండల నాయకులు గిడ్ల. పరంజ్యోతి, గోనే. శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, బుడిబుడి. ప్రభాకర్ ఇల్లంగి. తిరుపతి, నాగరాజు వెంకటేష్ బాల తదితర మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version