*ప్రజ్ఞకు పేదరికం అడ్డు కాదు..*
*ప్రభుత్వ కొలువుల్లో పహెల్వాన్ ఆకునూరు వినయ్*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10*
ప్రజ్ఞ కు పేదరికం అడ్డు కాదు అని నిరూపించాడు జమ్మికుంట పట్టణానికి చెందిన ఆకునూరు వినయ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని నివాసం ఉంటున్న ఆకునూరు వినయ్ మేదశక్తి ముందు పేదరికం ఓడిపోయింది. కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా తన పట్టుదల తనను గెలిపించింది. విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులకు పనిలో సహాయపడుతూ తన చదువును కొనసాగించాడు. తల్లిదండ్రులు గురువులు స్నేహితుల ప్రోత్సాహంతో తన కలల దిశగా వినయ్ ఈరోజు ఎన్నో విజయాలను సాధించాడు. ప్రస్తుతం జల సంఘం కేంద్రీయ విద్యాలయంలో పి& హెచ్ ఇ గా పనిచేస్తున్నాడు. ఆయన విద్యాభ్యాసం ఐదవ తరగతి నుండి ఇంటర్ వరకు రుక్మాపూర్ రెసిడెన్షియల్ పాఠశాల కరీంనగర్, బి పి ఈ డి కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఎం పి ఈ డి ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తయింది. అనేక రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభను కనబరిచారు.
*2024వ సంవత్సరంలో ఆయన సాధించిన విజయాలు…
డీఎస్సీ స్కూల్ పి ఈ టి ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ఒకటో ర్యాంక్ సాధించారు. డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పిడి రాష్ట్ర రెండవ ర్యాంక్ హైదరాబాద్ జిల్లా నాన్ లోకల్ కోట ర్యాంకు ఒకటవ ర్యాంకు సాధించారు. క్వాలిఫైడ్ జె ఆర్ ఎఫ్ జూనియర్ రీసెర్చ్ స్కాలర్ గురుకుల పిడి రాష్ట్ర మూడవ ర్యాంకు ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టీచర్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. ఈ విధంగా అనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పేదరికం ప్రతిభకు అడ్డు రాదని విరూపించాడు ఆకునూరు వినయ్ ఉన్నత ఆశయాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని పలువురు కోరుకుంటున్నారు