ప్రభుత్వ విధానాలతో నష్టాల్లోకి విద్యుత్ సంస్థలు

ప్రభుత్వ విధానాలతో నష్టాల్లోకి విద్యుత్ సంస్థలు

ఈ ఈ ఐ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్

విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే మెరుపు సమ్మె తప్పదు

టీజీ యు ఈ ఈ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ డిమాండ్

సిద్దిపేట జనవరి 5 ప్రశ్న ఆయుధం :

ప్రభుత్వ విధానాలతో విద్యుత్ సంస్థలు నష్టంలోకి పోతున్నాయని, వాటిని సాకుగా చూపి విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని ఈఈఐఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్ ఆరోపించారు.

IMG 20250105 WA0091

రాష్ట్ర 4 వ మహాసభల రెండవ రోజు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుదీప్ దత్ మాట్లాడుతూ చండిఘర్, రాజస్థాన్ లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం ప్రయత్నించగా, వాటిని వ్యతిరేకిస్తున్నామని, ఉత్తరప్రదేశ్ లో 48 జిల్లాలలో ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పగించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యుత్ ను ప్రవేట్ సంస్థలకు అప్పగించడానికి ప్రీపెయిడ్ మీటర్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చిందని, డబ్బులను ప్రైవేట్ సంస్థలతో వసూలు చేయిస్తుందని, తర్వాత విద్యుత్ సంస్థను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు. వాటిని ఎదుర్కునేందుకు మనమందరం ఐక్యంగా ఉండి పోరాడాల్సి ఉందన్నారు. విద్యాత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని వాటిని ప్రైవేట్ పరం చేస్తేనే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రెండు యేండ్లలో పూర్తి చేయాల్సిన యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను గత 7 సంవత్సరాలనుండి నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్లాంట్ లను సరైన సమయం లో నిర్మిస్తే బయట నుండి విద్యుత్ కొనుగోలు అవసరం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి దారి వ్యవస్థకు కొమ్ముకాస్తూ ప్రైవేట్ విద్యుత్ సంస్థలనుండి విద్యుత్ ని అధిక రేటులో కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవెట్ సంస్థల నుండి 6000 మెగా వాట్స్, సెంట్రల్ నుండి 3000 మెగా వాట్స్, ఛత్తిస్ ఘర్ రాష్ట్రం నుండి 1000 మేఘవాట్స్ విద్యుత్ నీకొనుగోలు చేస్తున్నారని అన్నారు. దశ, దిశ లేని ప్రభుత్వ పాలసీ వల్ల ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటూ ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రాతోఘటిస్తామన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మె చేయడానికి సిద్ధమవుతారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ఆలోచనలు మానుకోవాలని

టీజీయూఈఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ సూచించారు. విద్యుత్ రంగంలో ఉద్యోగుల నియామకం జరగక ఉన్న ఉద్యోగులపై పని భారం పడి ఒత్తిడి పెరిగిందన్నారు. గత ప్రభుత్వం 20 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆర్టిజన్ గా నామకరణం చేసి, తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్నారని, వారికి వేతనాలు పెంచాలని, అన్ మెన్ కార్మికులు సమానంగా విధులు నిర్వహిస్తున్న వేతనాలు తక్కువగా వచ్చి చాలీచాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతిని అమలు చేస్తుందని, ప్రవేట్ పీస్ రేట్ వర్కర్లతో పని చేయించుకుంటుందని, వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని, విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జిపిఎఫ్ ను అందించాలని, ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పాత పెన్షన్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని మహాసభలో తీర్మానం చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2022 విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, చండీగర్ లో విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విద్యుత్ వినియోదారులకు ఒక్క యూనిట్ ను రూ 2.40 నుండి 4.50 ధరతో అందిస్తున్నారని, ప్రవేట్ పరమైతే ఒక యూనిట్ కి రూ 8 – 12 పెరిగే అవకాశం ఉందని, ఉచిత విద్యుత్ అంది అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో 90 శాతం వ్యవసాయం బోర్ బావులపై ఆధారపడి జరుగుతుందని, ఇక్కడ ఉచిత విద్యుత్తు ఇవ్వకపోతే బోర్ బావులపై ఆధారపడి పని చేస్తున్న రైతులందరిపై భారం పడుతుందని, అప్పుడు వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని అన్నారు. ఉద్యోగులకు, ప్రజలకు, రైతులకు అందరికీ ప్రైవేటీకరణ జరిగితే నష్టమవుతుందన్నారు. సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న వారందరం ఏకమై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మహాసభలో సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన రాళ్ల బండి శశిధర్, యూనియన్ కంపెనీ అధ్యక్షులు సింగిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట మధు, యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటుపల్లి సధాకర్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, యూనియన్ జిల్లా అధ్యక్షులు ర్యాకం అశోక్, నాయకులు నాగేందర్ రెడ్డి, రవికుమార్ గౌడ్, శ్రావణ్, గిరి గౌడ్, కనకరాజు, పరశురాములు, భూపతి రాజు, భాస్కర్ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now