Headlines in Telugu:
-
పిట్లం మండలంలో ప్రజా పాలన విజయోత్సవాలకు ఘన ప్రారంభం
-
విద్యార్థుల వ్యాసరచన పోటీలకు మండల స్థాయి గుర్తింపు
-
విజేతలకిచ్చిన బహుమతులు – విద్యార్థుల్లో ఆనందం
-
బాలికల ఉన్నత పాఠశాలలో ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు
-
ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో విజయవంతమైన కార్యక్రమం
డిసెంబర్ 1
పిట్లం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం నాడు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూప్ సింగ్ తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీయులు అరుణ, ఉపాధ్యాయులు రమేష్, క్లస్టర్ రీసెర్చ్ పర్సన్ అహ్మద్ పాషా విద్యార్థినిలు పాల్గొన్నారు. సంధ్యారాణి.