Site icon PRASHNA AYUDHAM

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన ప్రజా ప్రెస్ క్లబ్ కమిటీ, చైర్మన్ దస్తగీర్

IMG 20241220 WA01691

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాగా ప్రముఖ పాత్ర పోషిస్తున్న మీడియా. ప్రజ సమస్యలకు పరిష్కార దిశగా ముందుండి నడుస్తున్న, ప్రజా ప్రెస్ క్లబ్ దమ్మపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన ప్రజా ప్రెస్ క్లబ్ భవనాన్ని ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ దస్తగీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కరోనా వంటి కష్ట సమయంలో కూడా సమాజానికి ఎంతగానో కృషి చేశారు. వారిని నిజంగా సన్మానించడం అనేది గొప్ప విషయంగా భావించారు. నిజమైన అర్హులు వీరే అని కొనియాడారు. ప్రజా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా షేక్ దస్తగీరు, వైస్ ప్రెసిడెంట్ ద్రుపతి రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి బజ్జూరి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి గుల్ల రాంబాబు, ప్రచార కార్యదర్శి, మేకల ఉపేందర్, నీలం రాజేశ్వరి,ముఖ్య సహాయకులు బొబ్బిలి రాకేష్, కమిటీ సభ్యులు ఎంఏ వసిం అక్రమ్, ఎండి సాలార్, నడ్డి సాయి, షేక్ ఖాసిం, నూనె హనుమంతరావు, యార్లగడ్డ మణికంఠ, తంగెళ్ళమూడి శివకృష్ణ, పండురి కిరణ్,డొక్కా గోపి. ఎన్నుకున్నారు.

Exit mobile version