*ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించిన వోడితల ప్రణవ్*
*హుజురాబాద్ జూన్ 26 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామంలో కాంగ్రెస్ యువజన నాయకుడు జగన్ తండ్రి ఇటీవల మృతి చెందగా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ జగన్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు పెద్దంపల్లి గ్రామంలో కాంగ్రెస్ యూత్ నాయకుడు ఎడ్ల రాజు అత్తమ్మ ఇటీవల మృతి చెందగా రాజును వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.కుటుంబ సభ్యులను మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అలాగే ఇల్లందకుంట మండలంలోని పాతర్ల పెళ్లి గ్రామంలో చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు నియోజకవర్గంలో రైతుల కుటుంబాలకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ రామారావు కాంగ్రెస్ నాయకులు దేశినీ కోటి, సుంకరి రమేష్, గూడెం సారంగపాణి, పొనగంటి మల్లయ్య, ఎక్కేటి సంజీవరెడ్డి, రాచపల్లి సదయ్య, తిరుపతి రెడ్డి పోశెట్టి,రాజు ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.