*సొంత ఖర్చుతో మొరం పోయించి దారి ఏర్పాటు రైతు నేస్తం -ప్రశాంత్ ముద్దుల*
*వాన కాలంలో అన్నదాతకు ఇబ్బంది కాకుండా చొరవ
తమ పొలాలకు ఎరువులు, ఇతర సామగ్రి తీసుకెళ్లేందుకు దారి సుగమం*
*జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక జూన్ 20 ప్రశ్న ఆయుధం*
ప్రస్తుత మార్కెట్ మాయాజాలంలో అందరికంటే ఎక్కువ రైతు ఇబ్బందుల పాలవుతున్నాడని అందరికీ తెలుసని అన్నదాతకు అండగా ఉండాలని అందరూ అంటుంటారు కానీ, ఆచరణలో తాము చేయగలిగిన పని చేయదానికి మాత్రం వెనుకాడుతుంటారు అయితే, ఓ యువ నేత మాత్రం కర్షకుడికి అండగా నిలిచేందుకు మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రయత్నం చేశారు ఇంతకీ సదరు యువ లీడర్ ఎవరంటే.. వీణవంక మండలం లస్మక్క పల్లి గ్రామ నేత మద్దుల ప్రశాంత్ పటేల్ వీణవంక మండల పరిధిలోని లస్మక్క పల్లి గ్రామం నుండి మామిడి తోటకు వెళ్లే రహదారి తో పాటు ఆ మార్గంలో ఉన్న పొలాలకు ప్రతినిత్యం రైతులు వెళుతూ ఉంటారు వర్షాకాలంలో రహదారి బురద మయంగా మారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని ముందు చూపుతో ప్రశాంత్ తన సొంత ఖర్చులతో దాదాపు 150ట్రిప్పుల మొరం పోయించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నాడు.
అనంతరం మాట్లాడుతూ రైతులకు తన వంతు సహాయంగా రహదారి ఏర్పాటు చేయాలని సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు గ్రామంలోని పలువురు రైతులు ప్రశాంత్ సేవా దృక్పథాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో
గ్రామ రైతులు దాసరపు లక్ష్మణ్ వెంకట్ రెడ్డి, సమ్మిరెడ్డి, కోమల్ రెడ్డి, సంపత్, రాజిరెడ్డి, కుమార్ కొండల్ రెడ్డి గ్రామ రైతులు పాల్గొన్నారు. కాగా, “ఉన్న ఊరుకి సేవ చేస్తే.. కన్నతల్లికి సేవ చేసినట్టుగా భావించాలని, యువ నాయకుడు ప్రశాంత్ పటేల్ తన శక్తి మేరకు గ్రామ సర్వతోముఖాభివృద్ధికి తనవంతు ప్రయత్నము ఎల్లవేళలా చేస్తుండడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి, నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి సహాయ సహకారాలు.. అండదండలతో.. ప్రజాసేవలో తాను మరింత ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తానని ప్రశాంత్ పటేల్ వెల్లడించారు.