Site icon PRASHNA AYUDHAM

సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన ప్రతాపరెడ్డి

IMG 20250109 WA0071

సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన ప్రతాపరెడ్డి

*కొండపాక, జనవరి 09,

దుద్దెడ కేంద్రంగా నిర్వహిస్తున్న కొండపాక సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదిన పీడీ వాసుపై వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. గురువారము పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పితే ఎలా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల జరిగిన నష్టాన్ని సవరించాలని కోరారు. కార్యక్రమంలో కొండపాక మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version