వడదెబ్బ నివారణకు ముందస్తు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.

పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల లక్ష్యం 100శాతం పూర్తి చేయాలి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి.

*వైద్యధికారులకు సమీక్షా సమావేశం లో జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 14 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రాబోయే వేసవి కాలం దృష్యా ప్రజలు వడదెబ్బబారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష వి పాటిల్ సూచించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ అద్యక్షతన జిల్లా లోని అన్ని ఆరోగ్యకేంద్రాలలో పనిచేయుచున్న వైద్యధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు , సిబ్బంది తమ తమ పరిధిలోని ఆసుపత్రులకు, పి.హెచ్.సి లకు సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేపించే కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని, రాబోయే వేసవి కాలంలో వచ్చే వడదెబ్బబారిన పడిన వారికి తక్షణ చికిత్సలో భాగంగా అన్ని రకాల మందులు, ఓ.ఆర్.ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. గర్బిణినులను 12 వారలా లోపు ఎం.సి. హెచ్ పోర్టల్ నందు నమోదు చేయాలనీ, ఏదైనా ప్రమాదకరమైన వ్యాధులు ఉంటె గుర్తించి సకాలంలో పై స్థాయి ఆరోగ్య కేంద్రాన్ని పంపించి వైద్యం అందించాలని, మాతృ మరణాలను నియంత్రించాలి, ప్రతి ఒక్క ప్రాధమిక ఆరోగ్య కేంద్రం క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు . ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రోత్సవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను అవసరమైన యంత్ర పరికరాలు, సామాగ్రి మరియు సిబ్బంది కి సంబంధించి పూర్తి నివేదికలు రేపు సాయంత్రం లోగా అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. భాస్కర్ నాయక్, డిప్యూటీ డిఎం.హెచ్.ఓ డాక్టర్ సుకృత , సీహెచ్ . ఐ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాలాజీ. ఎం.హెచ్. ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆర్పి చైతన్య , ఎన్.సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరున్, మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్పందన, డిప్యూటీ డెమో ఎం.డి .ఫైజ్ మొహి ఉద్దిన్ పాల్గొనారు.

Join WhatsApp

Join Now