Site icon PRASHNA AYUDHAM

ప్రసవం చేస్తుండగా మత్తు మందు వికటించి గర్భిణి మృతి

IMG 20250627 WA0337

ప్రసవం చేస్తుండగా మత్తు మందు వికటించి గర్భిణి మృతి

ఆంధ్రప్రదేశ్ : తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలంలో వేళ్లచింతల గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణి లక్ష్మీ(33)కి ఆపరేషన్‌ కోసం మత్తు మందు ఇవ్వగా పరిస్థితి విషమించింది. రాజమహేంద్రవరం తరలించగా చికిత్స పొందుతూ కడుపులో బిడ్డతో సహా మృతి చెందింది. పెద్దాపురానికి చెందిన నాగుతో 12 ఏళ్ల క్రితం పెళ్లి కాగా పదేళ్ల కుమార్తె ఉంది. మత్తు మందు వికటించడం వల్లనే చనిపోయిందని కుటుంబీకుల ఆరోపణ చేస్తున్నారు.

Exit mobile version