Headlines in Telugu:
-
“జాతీయ లోక్ అదాలత్ కు సన్నద్ధమవుదాం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గ”
-
“సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి: కనకదుర్గ”
-
“లೋಕ అదాలత్ లో వివాదాల పరిష్కారం: తెలంగాణ జిల్లాలో ఏర్పాట్లు”
-
“న్యాయవాదులు, పోలీసులు కలిసి లోక్ అదాలత్ విజయానికి కృషి”
-
“సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కనకదుర్గ”
ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజా న్యాయపీఠాలను విజయవంతం చేయడానికి సన్నదమవుదామని ఇంచార్జీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గ అన్నారు.డిసెంబర్ 14 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా కోర్టు ప్రాంగణంలోని కోర్టులతో పాటు ఆర్మూర్, బోధన్ కోర్టులలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. న్యాయవాదులు,పోలీసు అధికారులు,కోర్టు సిబ్బంది తో కూడిన సన్నాహక సమావేశంలో వివాదాలను అభిమతం ప్రసంగించారు.న్యాయ ఎదుర్కొంటున్న న్యాయార్థుల మేరకు సివిల్ దావాలను,రాజీపడదగిన క్రిమినల్ కేసులను రాజీపద్దతిన పరిష్కరించి అవార్డులు అందజేయడం జరుతుందని తెలిపారు. అప్పీలుకు వీలులేని విధంగా సదరు కేసులను చట్టం గుర్తిస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతు సమాజ శ్రేయస్సు కోసం,వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చి అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కార వేదిక జాతీయ లోక్ అదాలత్ అని అన్నారు.జిల్లా పోలీసు శాఖ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేస్తుందని అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి తెలిపారు.సమావేశంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి,సినీయర్ సివిల్ జడ్జి పద్మావతి,జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపధ్యాయ్, శ్రీనివాసరావు,చైతన్య,హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి….
ఆధునిక యుగంలో టెక్నాలజీ విరివిగా ఉపయోగిస్తున్న నేపధ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గ కోరారు.లోక అదాలత్ సన్నహక సమావేశ అనంతరం సంబంధిత అధికారులు, న్యాయవాదులు,కక్షిదారులకు సైబర్ నేరాల విషయంలో కల్పించారు.అపరిచిత వ్యక్తులు,పోలీసుల వేషంలో ఉన్న నఖిలీ పోలీసుల ఫోన్ కాల్స్ ను నమ్మవద్దని ఆమె అన్నారు.చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని అలాంటి కాల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పుస్తకం హస్తభూషణం అనే నానుడి ప్రకారం పౌరుల చేతిలో పుస్తకం ఉండేదని టెక్నాలజీ పెరిగినందున ప్రతి వారి లో స్మార్ట్ ఫోన్ ఉంటుంన్నదని అన్నారు.సెల్ డాటా ను ఊయోగించుకుంటు సైబర్ నేరగాళ్ల వలలో పడుతు కోట్లాది రూపాయల ఉండేదని టెక్నాలజీ పెరిగినందున ప్రతి వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంన్నదని అన్నారు. సెల్ ఫోన్ డాటా ను ఊయోగించుకుంటు సైబర్ నేరగాళ్ల వలలో పడుతు కోట్లాది రూపాయల మోసానికి గురి అవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమంలో సైబర్ నేరాల బాధితుల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.అందమైన ఫోన్లతో ఆడుకుంటు అందమైన జీవితాన్ని ఆగం చేసుకుంటున్నామని జడ్జి కనకదుర్గ విచారం వెలిబుచ్చారు.స్మార్ట్ ఫోన్లను అవసరం మేరకు వినియోగించుకోవాలని భవిష్యత్ ను అంధకారం చేసుకోరాదని ఆమె అన్నారు. ఆన్ లైన్ అంటు అత్యశకు పోయి డబ్బులు పోగొట్టుకోరాదని ఆమె ప్రజలకు విన్నవించారు. సైబర్ నేరాలతో 2023 సంవత్సరంలో దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయల పైచిలుకు మోసాలకు ధనవంతులు,మధ్యతరగతి ప్రజలు నష్టపోయారని ఆమె తెలిపారు.అనంతరం సైబర్ నేరాల గురించి లఘుచుత్రం ప్రదర్శించారు.