Site icon PRASHNA AYUDHAM

సామజిక సేవకులు యస్ డి నా సర్ పాషా కి ప్రతిష్ఠాత్మక సేవా రత్న జాతీయ అవార్డు

 

బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కమిటీ అవార్డును చీకటి సూర్యులకు అంకితమిచ్చిన నా సర్ పాషా మణుగూరు ఏరియా సింగరేణి సేవా సమితి సభ్యులు ప్రముఖ సామాజిక సేవకులు, కార్మిక నాయకులు యస్ డి నా సర్ పాషా కి బహుజన సాహిత్య అకాడమీ (బి.ఎస్.ఏ) జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ  నాయకత్వంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక “సేవా రత్న నేషనల్ అవార్డు” ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నాచారంలో గల బి ఎస్ ఏ కార్యాలయంలో సంస్థ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఇతర కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆహ్వాన పత్రాన్ని నాసర్ పాషాకి ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్ సి ,ఎస్ టి, బీసీ మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళటం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా నిజమకారులకు సంఘ సేవకులకు రచయితలకు కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 8వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా సేవారత్న నేషనల్ అవార్డును అందజేనోట్లు తెలిపారు సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ,తమిళనాడు, కేరళ, కర్ణాటక, మరియు పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు ఆరు వందల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని రాధాకృష్ణ తెలిపారు. సింగరేణి సేవా సమితి సభ్యులు గా అనాధ విద్యార్థులకు,చెవిటిమూగ విద్యార్థులకు,వృద్ధాశ్రమలకు,సింగరేణి ఉద్యోగుల సహకారం తో ఆయన చేస్తున్న సేవల వారధిగా మరియు ప్రత్యేకించి ఆదివాసీలకు,నిర్వాసిత, సమీప గ్రామాల ప్రజలు ఎదోర్కొనే ప్రధాన సమస్యల ఉపాధి అభివృద్ధి స్పందించే వ్యక్తిగా గుర్తించి ఈ అవార్డును సెలక్షన్ కమిటీ ప్రకటించిందని ఈ సందర్భంగా పాషా జమీలా బేగం దంపతులకు ఆయన ఎంపిక లేఖ తో పాటు, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు , అవార్డు ను ప్రకటించిన సందర్భంగా నా సర్ పాషా తమ అనుభూతిని వ్యక్తం చేస్తూ బి ఎస్ ఏ సెలక్షన్ కమిటీ కి కృతజ్ఞలు తెలిపారు.నన్ను ఎంతగానో ప్రోత్స హిస్తున్న మణుగూరు ఏరియా సింగరేణి ఉద్యోగులకు ఈ అవార్డు ను అంకిత మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి మరియు జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఏ విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు పసుల రమేష్, నల్లా జ్యోతి,బి శ్రీనివాస్ మరియు నా సర్ పాషా కుటుంభ సభ్యులు జమీలా బేగం,హేర్షద్ బాబు, ఎండి వాహేద్,నల్లా కోవేల తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version