Site icon PRASHNA AYUDHAM

ఉద్దీపకం పుస్తకాన్ని పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయుడు పార్కలగండి రవికుమార్

IMG 20241128 WA0206

ప్రశ్నయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్ 28

ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ సహకారంతో ఉపాధ్యాయులు రూపొందించిన ఉద్దీపకం పుస్తకాన్ని పార్కుల గండి పాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ ప్రైమరీ స్కూల్లో మూడో తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉద్దీపకం పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 రోజులలో ఆంగ్లభాష ప్రావీణ్యతను తెలిపే క్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని, తెలియజేశారు. ఈ క్రమంలో ఉద్దీపకం పుస్తకం ద్వారా ఆంగ్లం గణితంలో చదువులలో అగ్రస్థానంలో విద్యార్థులు ఉంటారని అన్నారు. ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెచ్ఎం బాలకృష్ణారెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Exit mobile version