*హైదరాబాద్ కార్వాన్ లోని కుస్తీ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాదిరి పృథ్వీరాజ్ .*
*
* మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా తెలంగాణ హిందూ యువసేన ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కార్వాన్ రాజలింగయ్య కబడ్డీ స్టేడియంలో 3వ శ్రీ శివ మార్కండేయ కేసరి రెస్ట్లింగ్ ఛాంపియన్షిప్ – 2025 నిర్వహించబడింది. పటాన్చెరు బీఆర్ఎస్ యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ స్థానిక స్థాయి రెస్ట్లింగ్ పోటీలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన రెస్ట్లర్లు తమ ప్రతిభను ప్రదర్శించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పోటీల అనంతరం నిర్వాహకులు మాదిరి ప్రిథ్వీరాజ్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాదిరి ప్రిథ్వీరాజ్ , యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఇలాంటి పోటీల ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. బాల కేసరి ఫైనల్ కుస్తీలో విజయం సాధించిన వారికి పటాన్చెరు హనుమాన్ వ్యాయామశాల తరపున ₹10,000 నగదు బహుమతి అందజేశారు.*