ఫ్రొఫెసర్.సాయిబాబా కు మరణం లేదు 

ఫ్రొఫెసర్

ఫ్రొఫెసర్.సాయిబాబా కు మరణం లేదు 

పదేళ్ల జీవితంలో అలిపెరగని యోధుడు

కొత్తగూడెం ప్రజా సంఘాల ఘన నివాళి

కొత్తగూడెం: అక్టోబర్ 29  మానవ హక్కుల ఉద్యమకారుడు ప్రముఖ రచయిత విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూసిన సంగతి తెలిసిందే, ఆదివాసీలు అండగా నిలీచినందుకే రాజ్యం కుట్ర పూరితంగా, చాలా పకడ్భందీగ జి ఎన్ సాయిబాబాను హత్య గా భావించిందని ఆయన అనునిత్యం ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటాడని ప్రజా సంఘాలు,పౌర సంస్థల నాయకులు అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్థానిక ప్రకృతి ఆశ్రమం లో ఫ్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ సి.ఎల్.సీ జిల్లా అధ్యక్షుడు ఎస్. ఉపేందర్ అధ్యక్షతన నిర్వంహించిన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. పూర్తి అంగ వైకల్యంతో కూడా జిఎన్. సాయిబాబా పేద, దళిత మరియు ఆదివాసీ ప్రజల తరపున రాజీ లేని పోరాటం చేయటం వ్యవస్థకే సవాల్ లాంటిదని వారు అభివర్ణించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే పేరుతో అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సుమారు దశాబ్ద కాలం పాటు నాగపూర్ అండ సెల్ జైలులో నిర్బంధించబడ్డ సాయిబాబా పాలకుల చేతిలో హత్య గావించబడ్డాడని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. జి ఎన్ సాయిబాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు జి ఎన్ సాయిబాబా మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాల్లర్పించారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్. ఉపేందర్, ఐలు రాష్ట్ర నేత రమేశ్ కుమార్ మక్కడ్, ఆరోగ్య కార్యకర్త సుగుణారావు, ఐ.ఎఫ్. టి.యు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు, రిటైర్డ్ జీఎం ఎస్వి, టిపిఎఫ్ జిల్లా కన్వినర్ సంజీవరావు, నాయకులు ఎట్టి ప్రశాంత్, రమటెంకి అశోక్, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు మల్లెల రామనాధం, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సైదుబాబు, జర్నలిస్టు కొండ జంపన్న, పి.డి యస్.యు పూర్వ జిల్లా అధ్యక్షులు సురేష్, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కుమార్, మహిలా సంఘాల నాయకులు మంజుల, గీత, మంతెన బాలకృష్ణ తదితరలు పాల్గొని పాల్గొన్నారు

Join WhatsApp

Join Now