రైలులో నిషేధిత నల్లబెల్లం, పటిక పట్టివేత

నిజామాబాద్, సెప్టెంబర్ 19 (ప్రశ్న ఆయుధం) గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆపరేషన్ సత్కార్ కార్యక్రమంలో భాగంగా, నాందేడ్ నుండి విశాఖపట్నం వెళ్తున్న రైలులో ఆర్పీఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైల్వే సీఐ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రైలులో అక్రమంగా తరలిస్తున్న 2వేల కిలోల నల్లబెల్లం, 200 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నల్లబెల్లం విలువ సుమారు రూ.8 లక్షలు, పటిక విలువ రూ.40 వేలుగా ఉంటుందని పేర్కొన్నారు.

పట్టుబడిన సామాగ్రిని నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించామన్నారు. ఈ తనిఖీల్లో రైల్వే ఎస్సై సాయిరెడ్డి, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారని చెప్పారు.

Join WhatsApp

Join Now