ఉన్నతాధికారులపై దాడికి నిరసన..
-తహసిల్దార్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మావిలేజ్ కంపెనీ భూ సేకరణ కోసం నిర్వహించిన సమావేశానికి గ్రామానికి వెళ్లిన జిల్లా ఉన్నతాధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం రోజున పాలకుర్తి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతీక జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కూడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి పై ప్రజలు దాడి చేయడమే కాకుండా, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో తాహాసిల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్, డిటి వేణు, ఆర్ఐ రాకేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారులపై దాడికి నిరసన..
by kana bai
Published On: November 12, 2024 6:31 pm