కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుటరైతులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రైతుల డిమాండ్ చేశారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రెండు లక్షల రూపాయలు మాఫీ కానీ రైతులకు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లిపల్లి మహేందర్ రెడ్డి,పైడి జనార్దన్, ఎడ్ల నర్సింలు, చక్రధర్ గౌడ్,సంకరి విఠల్, గడ్డం ఆంజనేయులు, గడ్డం రాజ్ కుమార్,పయ్యావుల గంగాధర్, పయ్యావుల చంద్రం , లింబాయాల శ్రీనివాస్ రెడ్డి,ఆస మహేష్, అగ్రికల్చర్ ఏవో ప్రజాపతికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏవో మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
