ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 11 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన పిట్ట నాగరాజు కమ్మరి దుర్గాప్రసాద్ ప్రమాదవశాస్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఆ కుటుంబాన్ని పరామర్శించినా ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన పంబండ అగమయ్య ముదిరాజ్,గత కొన్ని రోజులుగా గుండె నొప్పితో బాధపడుతూ మృతి చెందారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం, నిత్యవసర సరుకులు తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అందజేశారు. అనంతరం లింగోజిగూడ తాండకు చెందిన మాలోత్ చంద్ర నాయక్ మాలోత్ అమ్రా నాయక్ మృతి చెందగా వారి కుటుంబాలను మాజీ జెడ్పిటిసి పాప మహేష్ గుప్తా పరామర్శించి ఒక్క కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున అధిక సహాయం అందజేశారు
మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సహాయం..
మెదక్ జిల్లా శివ్వంపేట చిన్న గొట్టిముక్కల గ్రామానికి చెందిన గుత్తి నర్సింలు జీవనోపాధికై చెన్నైకి వలస వెళ్లి కూలి పని చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం వశత్తు రైలులో నుండి కిందపడి తీవ్ర గాయాలతో బాధపడుతున్న నర్సింలుకు చికిత్స నిమిత్తం 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల నాయకులు చింతల స్వామి లింగోజిగూడ మాజీ సర్పంచ్ రవి చిన్న గొట్టిముక్కుల మాజీ సర్పంచ్ బాలమణి నరేందర్, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు, పాపయ్య చారి యాదగిరిరావు శంకర్ గౌడ్, కిషన్ నాయక్ సాదు రాములు, పిట్ల శ్రీనివాస్ ,పిట్ల కుమార్, చింతకాయల యాదయ్య , గోపాల్ , సాదు ,శీను, అభిలాష్, దుబ్బ రాములు మాలోత్ శంకర్, సుదర్శన్ బుర్ర ఆంజనేయులు మరియు పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.