Site icon PRASHNA AYUDHAM

ఉపాధ్యాయుడిపై దాడిని ఖండించిన పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

IMG 20250626 WA0527

ఉపాధ్యాయుడిపై దాడిని ఖండించిన పి ఆర్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

— పుల్గం, దామోదర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 26

 

విద్యార్థిని తండ్రి దాడి చేసిన ఉపాధ్యాయుడు బాలకృష్ణను పిఆర్టియు నాయకులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా పఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, మాట్లాడుతూ

కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలోని హనుమాన్ మందిర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జిటి ఉపాధ్యాయులు బాలకృష్ణ పై విద్యార్థిని తండ్రి దాడి చేయడం హేయమైన చర్య అని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై చేయి చేసుకోవడం మూర్ఖత్వం అని అన్నారు. సంఘం ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని విధి నిర్వహణలో ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన వారికి పిఆర్టియు అండగా ఉంటుందన్నారు. పరామర్శించిన వారిలో కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అసిస్టెంట్ అధ్యక్షులు గోవర్ధన్, సుధాకర్, బిల్య, విష్ణువర్ధన్, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు రమణ, హన్మండ్లు, రాజు, సంతోష్ కుమార్, స్వామి, రాజిరెడ్డి, కృష్ణారావు, శ్రీనివాస్, అంతయ్య, జిల్లా బాధ్యులు శ్రీకాంత్, రజనీకాంత్ గౌడ్, పారు, దామోదర్, రమేష్,లు పాల్గొన్నారు.

Exit mobile version