ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మర్యాదపూర్వకంగా కలిసిన పి టి జి నూతన ప్రిన్సిపల్ ఎ.సత్యవతి..

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మర్యాదపూర్వకంగా కలిసిన పి టి జి నూతన ప్రిన్సిపల్ ఎ.సత్యవతి..*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 18 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్త మహేశ్వరరావు

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల పి టి జి రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ గా ఏ.సత్యవతి కొద్ది రోజులు ముందు బాధ్యతలు చేపట్టారు. అనంతరం బుధవారం నాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉన్నతమైన విద్యను అందించాలని ప్రిన్సిపాల్ కు ఎమ్మెల్యే సూచించారు. అందరి సహకారంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తానని ప్రిన్సిపల్ తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment