*ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్*
*ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 18( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
ప్రజలు విన్నవించే ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ను నిర్వహించడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరారు. బుధవారం ఎమ్మెల్యే టిడిపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజలు ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతి పత్రాలు అందించారు. అలాగే పార్వతీపురం నియోజకవర్గంలో గల సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలం, పట్టణానికి సంబంధించిన పలువురు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, కాలువలు, బదిలీలు, పలు సమస్యలపై వినతలు అందించారు. తక్షణ పరిష్కారానికి ఈ వినతులను పరిశీలించి సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు.