Site icon PRASHNA AYUDHAM

శ్రీ స్నేహ బీ.యచ్.ఈ.యల్ లేక్ వ్యూ రెసిడెన్సిలో దుర్గామాతకు పూజలు

IMG 20241012 233128

Oplus_131072

IMG 20241012 233136

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబరు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండల కేంద్రంలోని రాంచద్రారెడ్డినగర్ కాలనీలోని శ్రీ స్నేహ బీ.యచ్.ఈ.యల్ లేక్ వ్యూ రెసిడెన్సిలో నెలకొల్పిన దుర్గామాతకు తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలను వేదపండితులు పాలపర్తి గురునాథ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నిర్వహణ కమిటీల సారధ్యంలో మంగళ హారతులతో, మేళతాలతో, కోలాటంలతో, అమ్మ వారి కీర్తనలతో చేసిన శోభాయాత్ర చూపరులను ఆకట్టుకుంది. ఈ శోభాయాత్రలో నిర్వాహణ కమిటీల సభ్యులు యం.మహేశ్వర్ రెడ్డి, క్రిష్ణారావు, శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజేష్ సింగ్, రంజిత్, గణేశ్, మురళీధర్ రెడ్డి తదితరులు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఉత్సవాల నిర్వాహణలో ఉత్సహంగా పాల్గొన్నారు. వీరితో పాటు ప్రాంగణం పర్యవేక్షులు ఉత్తమ్ కూడా ఉత్సవాల నిర్వహణలో పాలు పంచుకున్నారు. ఈ శోభాయాత్రలో తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ దాత రాజేశ్ సింగ్ దాతృత్వాన్ని అభినందించారు. అతివైభవంగా అమ్మవారి శోభాయాత్రను నిర్వహించిన ఉత్సవ నిర్వాహణ కమిటీల సభ్యులందరిని పేరు పేరున అభినందించారు. అందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. రాంచంద్రాపురం పుర వీధులగుండా అమ్మ వారిని ఊరేగింపుగా తీసుకెల్లి రాంచంద్రాపురంలోని రాయసముద్రం చెరువులో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

Exit mobile version