Site icon PRASHNA AYUDHAM

పున్నం సరళ నేత్రాలతో ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు

IMG 20250103 WA0074

*పున్నం సరళ నేత్రాలతో ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు*

*పున్నం సరళ నేత్రాలు సజీవం*

*జమ్మికుంట జనవరి 3 ప్రశ్న ఆయుధం:*

పున్నం సరళ నేత్రాలు సజీవం నేత్రదానం చేసి ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించారు శుక్రవారం రోజున జమ్మికుంట పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీకి చెందిన పున్నం సరళ (62) ఉదయం 8-00గంటలకు గుండెపోటుతో మృతిచెందగా యోగా మిత్రుడు చిటికేసి శివానందయ్య సమాచారం మేరకు ఉప్పుల మహేందర్ రెడ్డి, డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కల్వల దీప్తి కిషన్ రెడ్డి, యోగ గురువు నరహరి, నేత్రదానంపై వారి కుటుంబ సభ్యులకు అవగాహనకల్పించగా ,కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో యోగా గురువు సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి సమక్షంలో వరంగల్ ఎల్ వి పి టెక్నీషియన్ ప్రదీప్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్.వి ప్రసాద్ ఐ బ్యాంకు కు పంపించారు ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన

పున్నం రామ్ రెడ్డి, కూతురు మంద పద్మ అల్లుడు ప్రవీణ్ రెడ్డి, కుమారుడు అనిల్ కుమార్ సహకరించిన ఉప్పుల మహేందర్ రెడ్డి వంగల రమేష్ , గర్రెపల్లి వెంకటేశ్వర్లు, చిదురాల శ్రీనివాస్ చిటికేసి శివానందయ్య, ముత్యాల జగదీశ్వర్, కల్వల దీప్తి కిషన్ రెడ్డి బంధుమిత్రులకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ , జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ,జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి,ప్రచార కార్యదర్శి వాసు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి లగిశెట్టి చంద్రమౌళి, బంధు మిత్రులు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version