Site icon PRASHNA AYUDHAM

ఫలించిన పట్టుదల.. ఎంబీబీఎస్ పట్టా పొందిన కొనుసోతు నందిత

IMG 20250305 WA02881

అశ్వరావుపేట ఆర్సి మార్చి 05) ప్రశ్న ఆయుధం న్యూస్

చిన్నతనం నుంచే డాక్టర్ అవ్వాలని కోరికతో నిరంతరాయంగా కష్టపడి, ఫలితాన్ని అందుకున్న, మల్కారం మాజీ సర్పంచ్ కూతురు కొనుసోతు నందిత, చిన్నతనం నుంచి చదువులో చురుకుగా ఉంటూ, డాక్టర్ అవ్వాలని ఒక ఉద్దేశంతో, మానవసేవే మాధవసేవ అని, గ్రహించుకొని, ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో డాక్టర్ రంగాన్ని ఎంచుకున్న నందిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పట్టా సాధించడంతో, మండల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తండ్రి రుప్ సింగ్ మాట్లాడుతూ, నా కూతురు ఎంబిబిఎస్ పట్టా తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరింత పేరు తీసుకురావాలని తెలియజేశారు. తన కూతుర్ని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా ఈ స్థాయిలో ఉండాలని సూచించారు.

Exit mobile version